Ap News: రాష్ట్రంలో నియంత్రత్వ పాలకుల్ని తరిమికొట్టాలి: వర్ల రామయ్య

by srinivas |   ( Updated:2023-01-26 14:07:23.0  )
Ap News: రాష్ట్రంలో నియంత్రత్వ పాలకుల్ని తరిమికొట్టాలి: వర్ల రామయ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రపంచంలోనే అతిగొప్పదైన, అత్యున్నతమైన లిఖితపూర్వక రాజ్యాంగం మనకు దక్కినందుకు భారతీయులుగా గర్వించాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్రవేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ అతికర్కశంగా, అమానుషంగా, రాక్షసంగా 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన బ్రిటీష్ దొరలను, చిన్నరక్తపుబొట్టు నేలరాలకుండా, అహింస అనే ఆయుధంతో తరిమి తరిమి కొట్టిన ఆనాటి ఘట్టాలను నేడు ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని వర్ల రామయ్య పిలుపునిచ్చారు. అదే స్ఫూర్తి, తెగువ, ధైర్యంతో నేడు రాష్ట్రాన్ని ఏలుతున్న నియంతల్ని కూడా రాష్ట్రం నుంచి పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఆంధ్రాయువతపై ఉందని సూచించారు. భరతమాత ఆశీస్సులు ప్రతిఒక్కరికీ ఉండాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలు, శాంతిసామరస్యాలతో జీవించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రామయ్య చెప్పారు. గణతంత్రవేడుకల్లో భాగంగా టీడీపీ నేతలు, కార్యాలయ సిబ్బంది జాతీయనాయకుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, టీడీపీరాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్, టీటీడీ బోర్డు మాజీసభ్యులు ఏ.వీ.రమణ, ఆహ్వానకమిటీ సభ్యులు హసన్ బాషా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: ప్రణాళిక బద్ధంగా వెళ్తే భారత్ దే అగ్రస్థానం : చంద్రబాబు

Mla Jyothula Chantibabu: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

Advertisement

Next Story

Most Viewed